బిహార్ అసెంబ్లీ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం

-

బిహార్లో కొలువుదీరిన ఎన్డీఏ సర్కారు బలనిరూపణపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ స్పీకర్గా ఉన్న ఆర్జేడీ నేత అవధ్ బిహారీ చౌదరిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానం నోటీసును బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ యాదవ్ అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఈ తీర్మానంపై నందకిశోర్తో పాటు బిహార్ మాజీ సీఎం జీతన్రామ్ మాంఝీ, మాజీ డిప్యూటీ సీఎం తారాకిశోర్ ప్రసాద్, జేడీయూ ఎమ్మెల్యే వినయ్ కుమార్ చౌదరి సంతకాలు చేశారు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారు. స్పీకర్ రాజీనామా చేయకపోతే ఓటింగ్ నిర్వహించి స్పీకర్ తొలగింపు ప్రక్రియపై సభ్యుల అభిప్రాయం కోరతారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఎన్డీఏ కూటమిదే పైచేయిగా ఉంది. క్రాస్ ఓటింగ్ జరగకపోతే స్పీకర్ తొలగింపు ఖాయమేనని స్పష్టమవుతోంది. ఆర్జేడీ నుంచి గెలిచిన అవధ్ బిహారీ చౌదరి జేడీయూ-కాంగ్రెస్-ఆర్జేడీ మహా కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత స్పీకర్గా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్డీఏ సర్కార్ కొలువైన నేపథ్యంలో ఆయన్ను కొనసాగిస్తే సభలో ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ సర్కారు స్పీకర్పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news