పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం షెడ్యూల్‌ ఇదే

-

భారత పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవానికి రెడీ అయింది. మే 28న జరిగే వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షత వహించనున్నారు. పార్లమెంట్‌ను జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని రెండు దశలుగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్ ను తాజాగా విడుదల చేశారు.

  • మే 28వ తేదీన తెల్లవారుజామునే పాత పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పూజ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ క్రతువులో ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సహా పలువురు సీనియర్‌ మంత్రులు పాల్గొననున్నారు.
  • పూజ అనంతరం వీరంతా లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్లను సందర్శిస్తారు. లోక్‌సభ స్పీకర్‌ కుర్చీ కుడి పక్కన రాజదండాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పాటు సెంగోల్‌ రూపకర్తలు సైతం హాజరుకానున్నారు.
  • అనంతరం నూతన పార్లమెంట్‌ ఆవరణలోనూ పూజలు చేయనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఉదయం 9.30 గంటలలోపే పూర్తి కానున్నాయి.
  • అనంతరం మధ్యాహ్నం జాతీయ గీతాలాపనతో రెండో దశ ప్రారంభ వేడుకలు మొదలుకానున్నాయి.
  • ఆ తర్వాత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ ప్రసంగిస్తారు.
  • అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడతారు.
  • పార్లమెంట్‌ నిర్మాణం సమయంలోని అనేక ఘట్టాలతో రూపొందించిన వీడియోలను ప్రదర్శిస్తారు.
  • తర్వాత లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రసంగిస్తారు. స్పీకర్‌ ప్రసంగం అనంతరం రాజ్యసభలో ప్రతిపక్ష నేత మాట్లాడానికి సమయాన్ని కేటయించినట్లు తెలుస్తోంది.
  • అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడతారు.

Read more RELATED
Recommended to you

Latest news