రోజూ దేవుడిని ప్రార్థిస్తే..హత్యాచారం కేసులో శిక్ష తగ్గింపు – ఒడిశా హైకోర్టు

-

ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హత్యాచారం చేసిన నిందితుడి కేసులో ఒడిశా హైకోర్టు విచిత్రమైన తీర్పు ఇచ్చింది. దీంతో దేశమే ఆశ్చర్యపోయింది. రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాడని.. హత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష నుండి జీవిత ఖైదుకు శిక్ష తగ్గింపు చేసింది ఒడిశా హై కోర్టు. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

Odisha High Court Changes Death Sentence for Convicted Child Murderer

ఒడిశాలోని జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాలో 2014 ఆగస్టు 21న ఓ ఆరేళ్ల చిన్నారి తన అన్నతో కలిసి చాక్లెట్లు కొనుక్కొని వస్తుండగా, కామాంధులు అపహరించి అత్యాచారం చేసి చంపేశారు. ఈ కేసులో దొరికిన నిందితులకు పొక్సో కోర్టు మరణ శిక్ష విదించగా.. ఒడిశా హైకోర్టు అందులో ఒక నిందితుడు రోజు దేవుడిని ప్రార్థిస్తున్నాడని మరణ శిక్ష నుండి జీవిత ఖైదుకు తగ్గించింది ఒడిశా హైకోర్టు. ఇక ఒడిశా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశమే ఆశ్చర్య పోయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version