ఇజ్రాయెల్​లో చిక్కుకున్న భారతీయుల కోసం.. ‘ఆపరేషన్​ అజయ్’

-

ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య పోరు భీకరంగా సాగుతోంది. రోజురోజుకు ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్​లో చిక్కుకున్న దాదాపు 18 వేల మంది భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలపై కేంద్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఆపరేషన్ అజయ్​ను మొదలుపెట్టి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​ ఆపరేషన్ అజయ్​ను ప్రారంభిస్తున్నట్లు ఎక్స్​ వేదికగా పోస్టు చేశారు. జై శంకర్​ ప్రకటనతో ఇజ్రాయెల్​లోని భారత ఎంబసీ.. రిజిస్టర్​ చేసుకున్న భారతీయులకు ఈ-మెయిళ్లను పంపి.. మిగతా వారికి ఆ తర్వాత వచ్చే విమానాల్లో తరలిస్తామని తెలిపింది.

ఇజ్రాయెల్‌, పాలస్తీనాల్లో ఉన్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం అత్యవసర సహాయక కేంద్రాలను(హెల్ప్‌లైన్‌) దిల్లీ, టెల్‌అవీవ్‌, రమల్లాలో ఏర్పాటు చేసింది.

దిల్లీ కంట్రోల్‌ రూం నంబర్లు, ఈ మెయిల్‌ చిరునామా వివరాలు..

1800118797 (టోల్‌ఫ్రీ),

+91-11-23012113,

+91-11-23014104,

+911123017905,

+919968291988,

[email protected]

భారత రాయబార కార్యాలయాలు టెల్‌ అవీవ్‌, రమల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల ఫోన్‌ నంబర్లు, ఈ మెయిల్‌ వివరాలు

+97235226748,

+972543278392,

[email protected];

+970592916418 (వాట్సాప్‌ కూడా),

[email protected]

Read more RELATED
Recommended to you

Latest news