ఉత్తరాఖండ్​లో మరో ఘోరం.. ఆగి ఉన్న బస్సులో అనాథ​పై గ్యాంగ్​రేప్

-

 కోల్​కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన మరవకముందే దేశవ్యాప్తంగా మరికొన్ని అఘాయిత్యాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యువతులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కోల్ కతా ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నా.. మరోవైపు ఈ ఘటనలు ఆగడంలేదు. తాజాగా ఏపీలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది.

ఇక ఉత్తరాఖండ్​లో ఓ టీనేజర్​పై గ్యాంగ్ రేప్ జరిగింది. దెహ్రాదూన్​లోని అంతర్ రాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఆగి ఉన్న బస్సులో ఓ అనాథ టీనేజర్ పై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన ఆగస్టు 13వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బృందం బాధితురాలిని రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం పటేల్ నగర్ పోలీస్ స్టేషన్​లో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news