భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ఫిక్స్ అయింది : పాక్ నటి

-

World Cup -2023 : భారత్-న్యూజిలాండ్ సెమీ ఫైనల్ ఫిక్స్ అయిందంటూ పాకిస్తాన్ నటి సెహార్ షిన్వారి సంచలన ఆరోపణలు చేసింది. ‘భారత టీమ్ ఆటగాళ్లు మంచి నటులు. ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని వారికి తెలుసు. కానీ నిజంగా మ్యాచ్ ఆడుతున్నట్లు నటించారు’ అని ట్వీట్ చేసింది.

Pakistani actress Sehar Shinwari sensational allegations
Pakistani actress Sehar Shinwari sensational allegations

‘ఇండియన్ టీం మరోసారి ఫైనల్ కు వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. భారత్ అన్నింటిలో మన దేశం కంటే ఎందుకు ముందు ఉంది?’ అని అక్కసు వెళ్లగక్కింది. కాగా 7 వికెట్ల వీరుడు షమీ సంచలన రికార్డు నమోదు చేసుకున్నాడు. ఇండియా తరఫున సెమీస్‌ లో 7 వికెట్లు పడగొట్టి.. దిగ్గజాల సరసన నిలిచాడు షమీ. తొలిసారిగా 1983 ప్రపంచ కప్ లో వెస్టిండీస్ బౌలర్ విన్ స్టన్ డేవిస్…. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో 7 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత 20 ఏళ్లకు గాని ఈ రికార్డు మళ్లీ నమోదు కాలేదు. 2003 WCలో ఆసీస్ బౌలర్లు గ్లెన్ మెక్ గ్రాత్, ఆండీ బిచెల్…. నమీబియా, ఇంగ్లాండ్ పై ఈ ఫీట్ సాధించారు. 2015లో టీం సౌథీ(NZ) ఇంగ్లాండ్ పై, తాజాగా భారత్ బౌలర్ షమీ కివీస్ తో పోరులో 7 వికెట్లు పడగొట్టారు.

 

Read more RELATED
Recommended to you

Latest news