నేడు సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్‌

-

దేశంలో కరోనా వైర‌స్ క‌ట్ట‌డిని మ‌రింత ప‌క‌డ్బందీగా చేప‌ట్టే దిశ‌గా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్యశాఖ మంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు, ఆరోగ్యశాఖ మంత్రులతో జరిగే వర్చువల్‌ సమావేశంలో ప్రధాని న‌రేంద్ర‌మోడీ కొవిడ్-19‌ నియంత్రణ చర్యలపై సమీక్షించనున్నారు. అయితే.. దేశంలో అత్య‌ధికంగా కొన్ని రాష్ట్రాల్లోనే కేసులు న‌మోదు అవుతున్నాయి.

63శాతం యాక్టివ్‌ కేసులు ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇక‌ మొత్తం కరోనా కేసుల్లో 65.5శాతం, మరణాల్లో 75 శాతం వరకు ఈ ఏడు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్‌, ఢిల్లీలో కరోనా మరణాలు దేశ సగటు 1.6 శాతం కంటే ఎక్కువగా.. అంటే రెండు శాతం ఉండడంపై సమావేశంలో మోడీ ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే.. క‌రోనా మహమ్మారి కట్టడికి ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, కేంద్ర సహకారం, ఆరోగ్య, వైద్య మౌలిక సదుపాయాల పెంపు తదితర అంశాలను సైతం చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేప‌థ్యంలో మోడీ ఏం చెబుతారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news