శరద్‌ పవార్‌ అందుకే ప్రధాని కాలేదు: మోదీ

-

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్​పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధాని కాకపోవడానికి కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాలే కారణమని ఆరోపించారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందిన ఎన్డీయే కూటమి ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో మోదీ.. కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేశారు.

‘‘కాంగ్రెస్‌ తమ స్వార్థ ప్రయోజనాల కోసమే నడుస్తోందని మోదీ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నా.. ఆ పార్టీ వారసత్వ రాజకీయాల కారణంగా వారిని ప్రోత్సహించలేదని ఆరోపించారు. దీనివల్ల శరద్‌ పవార్‌, ప్రణబ్‌ ముఖర్జీ వంటి అత్యంత సమర్థులకు ప్రధాని అయ్యే అవకాశం లభించలేదు’’అని మోదీ అన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న మిత్రపక్షాలే తమకు ముఖ్యమని.. సమష్టిగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news