PM MODI: జూన్ 1న వారణాసిలో ఓటింగ్

-

PM MODI: జూన్ 1న వారణాసిలో ఓటింగ్ ఉంటుంది. వారణాశిలో ఏడవ విడత ఎన్నికల్లో జూన్ 1 న జరగనుంది పోలింగ్. కాశీలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు చేశారు. నేడు నామినేషన్ వేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. వారణాసి నియోజకవర్గం నుంచి మరో సారి పోటీ చేస్తున్న ప్రధాని మోడీ..ఈ సందర్భంగా కాశీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ వేశాక, రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు ప్రధాని మోడీ.

మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు పలువురు ప్రముఖులు. బీజేపీ పాలిత రాష్ట్రాల 12 మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన నేతలు జయంత్ చౌదరి (ఆర్ఎల్డీ), చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేపీ), అనుప్రియ (అప్నాదళ్), ఓంప్రకాశ్ రాజ్‌భర్ (సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ), పవన్ కళ్యాణ్ (జనసేన) చంద్రబాబు(టిడిపి) మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news