పుణె కారు ఘటన.. అప్పుడు బాగా తాగున్నా ఏం గుర్తులేదంటున్న నిందితుడు

-

పుణె మైనర్ కారు ప్రమాద ఘటనలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడిని పోలీసులు విచారించగా.. ప్రమాదం జరిగిన రోజు రాత్రి అసలు ఏమైందో అతడు గుర్తుకు తెచ్చుకోలేకపోయినట్లు తెలిసింది. ఆ టీనేజర్ ప్రస్తుతం అబ్జర్వేషన్ హోంలో ఉన్నాడు. తాను మద్యం మత్తులో ఉండటంలో ఆరోజు ఏం జరిగిందో తనకు గుర్తు రావడంలేదని అతడు చెప్పినట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి.

ప్రమాదానికి కొద్దిసేపటి ముందు ఆ మైనర్‌ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. తొలుత వెళ్లిన బార్‌లో నిందితుడు కేవలం 90 నిమిషాల్లోనే రూ.48వేల ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడి నుంచి మరో బార్‌కు వెళ్లి అక్కడ కూడా మద్యం తాగినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇంటికి వెళ్తుండగా ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతడిని మేజర్‌గా పరిగణించి దర్యాప్తు చేపట్టేందుకు అనుమతినివ్వాలని పోలీసులు ఇప్పటికే న్యాయస్థానాన్ని కోరిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news