2024 ఎన్నికలే లక్ష్యంగా.. భారత్ జోడో యాత్ర 2.0కు రాహుల్ రెడీ

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో దేశంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ రూపురేఖల్ని మార్చేశారు. ఈ యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఆ యాత్ర జోష్​తోనే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీ మరోసారి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. త్వరలోనే రాహుల్.. భారత్ జోడో యాత్ర 2.0ను ప్రారంభించేందుకు ప్లాన్​ చేస్తున్నారట.

ఈ యాత్రను సెప్టెంబర్​లో ప్రారంభించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అంతకుముందు దక్షిణాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన కశ్మీర్​ వరకు పాదయాత్ర సాగగా.. తాజాగా దేశ పశ్చిమం నుంచి తూర్పునకు యాత్ర చేపట్టేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది ​. గుజరాత్​లోని పోర్​బందర్ నుంచి త్రిపురలోని అగర్తలా వరకు భారత్ జోడో యాత్ర 2.0ను చేపట్టాలని భావిస్తోంది. సెప్టెంబర్​ 5న గుజరాత్ పోర్​బందర్​లోని మహాత్మ గాంధీ స్మారకం వద్ద నివాళులు అర్పించి పాదయాత్రను ప్రారంభించునున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news