మహిళల పరిస్థితి దారుణమని వ్యాఖ్యలు.. మంత్రిని బర్తరఫ్ చేసిన సీఎం

-

రాష్ట్రంలో మహిళలకు భద్రత కరవైందని అసెంబ్లీ వ్యాఖ్యలు చేసిన ఓ మంత్రిని గంటల వ్యవధిలోనే బర్తరఫ్ చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. సీఎం సిఫార్సుకు ఆ రాష్ట్ర గవర్నర్ కూడా వెంటనే ఆమోదం తెలిపారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

 రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్​​ ఆ రాష్ట్ర మంత్రి రాజేంద్రను బర్తరఫ్ చేస్తునట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరవైందని అసెంబ్లీలో రాజేంద్ర ప్రశ్నించారు. రాజస్థాన్​లో మహిళలపై వివక్ష రోజురోజుకు పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. “మణిపుర్ ఘటనను లేవనెత్తే బదులు.. ముందు మనమంతా ఆత్మపరిశీలన చేసుకోవాలి”. అని రాజస్థాన్ అసెంబ్లీ వేదికగా రాజేంద్ర వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై రాజేంద్ర విమర్శలు గుప్పించిన కొద్ది గంటలకే ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఆయన సిఫార్సును గవర్నర్​ వెంటనే ఆమోదం తెలిపారు. రాజేంద్ర హోంగార్డు, పౌర రక్షణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇవాళ అధికారిక వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news