సైనికులతో రాజ్ నాథ్ సింగ్ హోలీ వేడుకలు.. ఆర్మీ ఛీప్ కి కీలక సూచన

-

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదివారం లేహ్ లో సైనికులతో కలసి హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు.  ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ జవాన్లతో మాట్లాడారు. హోలీ పండుగ జరుపుకునేందుకు సైనికులు లేహక్కు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ‘సియాచిన్ సాధారణ భూమి కాదు. ఇది భారతదేశ సార్వభౌమాధికారం, సంకల్పానికి తిరుగులేని చిహ్నం’ అని కొనియాడారు. ఈ ప్రాంతం జాతీయ నిర్ణయాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. సాయుధ బలగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఏదైనా పండుగ వచ్చినప్పుడల్లా, సరిహద్దుల్లో మోహరించిన సాయుధ బలగాలతో ముందు రోజు వేడుకల్లో పాల్గొనడం ద్వారా కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పాలని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేకు సూచించారు. తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటమే తమ లక్ష్యమని వెల్లడించారు. సరిహద్దుల్లో బలగాలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. ఎన్ని బెదిరింపులు చేసినా భారత్ వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు. అయితే మొదట రాజ్ నాథ్ సింగ్ సియాచినన్ను సందర్శించాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ఆ ప్రోగ్రామ్ రద్దు చేశారు. వీలైనంత త్వరగా మరోసారి సందర్శిస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news