కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై అత్యాచారాలు ఎక్కువ – కేంద్ర మంత్రి అనురాగ్

-

మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోనే మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. అధికారిక డేటా ప్రకారం అత్యాచార కేసుల్లో రాజస్థాన్ టాప్ లో ఉందన్నారు.

పశ్చిమబెంగాల్, బీహార్ లోను మహిళలను నగ్నంగా ఊరేగించారని.. కానీ వాటి పట్ల ఎవరూ గళం విప్పలేదని, ఆందోళన వ్యక్తం చేయలేదని అన్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేరులో ఉన్న “మమత” ఆమెలో కొంచెం కూడా మిగిలి లేదా..? అని ప్రశ్నించారు. దేశంలోని పలు రాష్ట్రాలలో మహిళలపై నేరాలు పెరిగిపోయాయని, కొన్ని రాష్ట్రాలలో కనీసం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news