వాట్ ఏ స్పీచ్ జగన్ సాబ్.. నోరుజారిన ప్రతి ఒక్కరికీ రిటర్న్ గిప్ట్

-

పచ్చమంద అంతగా రెచ్చిపోతున్న సీఎం వైయస్ జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎల్లో మీడియాతో కలిసి ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేన ముప్పేటదాడి చేస్తున్నా ఎందుకు తిరగబడటం లేదు? ఇన్నాళ్లు వైసీపీ అభిమాని మదిలో మెదిలిన ప్రశ్నలు ఇవి. కానీ.. కరెక్ట్ టైమ్.. పచ్చమందకి దిమ్మతిరిగేలా సీఎం జగన్ ఒక్క స్పీచ్‌తో ఇచ్చిపడేశారు. బహుశా.. వాళ్లు ఇప్పట్లో తేరుకోలేరు కూడా.

వాలంటీర్లకు జగన్ అండ..!

వాస్తవానికి సీఎం జగన్ గత కొంతకాలంగా విమర్శల్ని తిప్పికొడుతున్నారు. కానీ.. తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో జరిగిన సభలో ఆ విమర్శల పదును పెరిగింది. దానికి కారణం గత కొన్నిరోజులుగా వాలంటీర్లపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వంగలపూడి అనిత చేసిన నీచపు వ్యాఖ్యలు. గత నాలుగేళ్లుగా నిస్వార్థంగా పేదల కోసం వాలంటీర్లు పనిచేస్తున్నా.. సంస్కారహీనంగా పచ్చమంద కామెంట్స్ చేయడం సీఎం జగన్‌కి కోపం తెప్పించింది. మంచి చేస్తున్న వారిని తిట్టడం సంస్కారం అనిపించుకోదు అంటూ చురకలు అంటించారు. అంతేకాదు.. వాలంటీర్లకి తాను అండగా ఉంటానని కూడా చాటిచెప్పారు.

మీలాంటి కుసంస్కారులా మా వాలంటీర్లని విమర్శించేది?

బహిరంగ వేదికపై మాట్లాడుతూ.. అమ్మాయిలు కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదంటే కడుపు చేయాలనే మహానుభావుడు ఒకరు (నందమూరి బాలకృష్ణ ).. మీరు సినిమాల్లో చేశారు నేను కాలేజీ రోజుల్లోనే చేసేశానని చెప్పే మాజీ సీఎం ఒకరు (చంద్రబాబు).. మళ్లీ మళ్లీ పెళ్లిళ్లు చేసుకుంటూ అమ్మాయిలకి ద్రోహం చేసేవాడు ఒకరు (పవన్ కళ్యాణ్).. అమ్మాయిలతో కలిసి మందుతాగి స్విమ్మింగ్ ఫూల్‌లో అసభ్యంగా పోజులు ఇచ్చే వాడు ఒకరు (నారా లోకేష్).. ఇలాంటి వాళ్లా మా వాలంటీర్ల గురించి మాట్లాడేది? అంటూ సీఎం జగన్ ఇచ్చిపడేశారు.

పక్కా ప్లాన్ ప్రకారమే వాలంటీర్లపై విమర్శలు..

వాలంటీర్లపై విమర్శలు పక్కా ప్లాన్‌తో చేస్తున్నారని ప్రజలకి సీఎం జగన్ వివరించే ప్రయత్నం చేశారు. స్క్రిప్ట్ రామోజీరావు ఇస్తుంటే.. చంద్రబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని.. ఆ ఇద్దరూ చెప్పినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడంటూ సీఎం వైయస్ జగన్ చెప్పుకొచ్చారు. అయితే.. ఇక్కడ ప్రజలు గుర్తించాల్సింది.. వాలంటీర్లు ఎవరో కాదు.. మన గ్రామంలోని పిల్లలే.. మన ఊరి బిడ్డలే. వాళ్ల గురించి మీకు తెలియదా? అంటూ సీఎం వైయస్ జగన్ చెప్పగానే సభలో వాళ్లంతా తెలుసు అంటూ రిప్లై ఇచ్చారు.

తేలుకుట్టిన దొంగల్లా ఇక పచ్చమంద

సీఎం వైయస్ జగన్ చెప్పిన మాటల్లో అన్నీ నిజాలే ఉన్నాయి. సాక్ష్యాలు కావాలంటే యూట్యూబ్‌లో బోలెడు దొరుకుతాయి. కాబట్టి.. పచ్చమంద మేము అలా మాట్లాడలేదు.. అలా చేయలేదు అని చెప్పే ధైర్యం చేయకపోవచ్చు. కాబట్టి.. ప్రస్తుతానికి తేలు కుట్టిన దొంగల్లా అందరూ ఉండిపోతారు. ఎల్లో మీడియా అసలు వెంకటగిరి సభలో సీఎం వైయస్ జగన్ రాజకీయ విమర్శలు చేయలేదు అనే తరహాలో వార్తలు వండుతుంది. కానీ.. ఇది సోషల్ మీడియా టైమ్ గురూ..  నీ ఎల్లో మీడియాలో చూసి వార్తలు తెలుసుకునే రోజులకి ఎప్పుడో కాలం చెల్లింది.

Read more RELATED
Recommended to you

Latest news