ఓటర్లకు ర్యాపిడో గుడ్ న్యూస్.. పోలింగ్ కేంద్రాలకు ఫ్రీ బైక్ రైడ్

-

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం రంజుగా సాగుతోంది. ఇప్పటికే తొలి దశ పోలింగ్ పూర్తయింది. ఇక రెండో దశ ఓటింగ్ కు రంగం సిద్ధం అవుతోంది. శుక్రవారం రోజున రెండో విడత పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలోనే రైడ్‌ షేరింగ్‌ ‘ర్యాపిడో’ ఓటర్ల కోసం ఓ ఆఫర్‌ తీసుకొచ్చింది. పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఉచితంగా బైక్‌ రైడ్‌ సదుపాయాన్ని కల్పిస్తామని ప్రకటించింది.

తమ సేవలను కేవలం కర్ణాటకలో మాత్రమే అందించేందుకు ర్యాపిడో సిద్ధమైంది. ఆ రాష్ట్రంలో ఏప్రిల్‌ 26వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఈ క్రమంలోనే ఓటింగ్ శాతాన్ని పెంచడంలో భాగంగా తమ వంతు కృషి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ర్యాపిడో ఓ ప్రకటన విడుదల చేసింది.

బెంగళూరు, మైసూర్‌, మంగళూరులో ఓటు వినియోగించుకునేవారు అయితే ఫ్రీ రైడ్ పొందాలంటే..  ‘VOTE NOW’ కోడ్‌ను వినియోగించి తమ సేవలను పొందాలని ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి కోరారు. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే క్రమంలో రవాణా విషయంలో ఎటువంటి ఆందోళన చెందకుండా దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్లు తమ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version