లోక్ సభ ఎన్నికల బరిలో పొలిమేర నటి.. అక్కడి నుంచి నామినేషన్

-

తెలంగాణ లోక్ సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఈరోజు ఎక్కువగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల బరిలో సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీనటులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. చాలా మంది ఇప్పటికే నామినేషన్లు కూడా వేశారు.

తాజాగా ఆ జాబితాలో మరో నటి చేరారు. ‘పొలిమేర’ సిరీస్‌ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దాసరి సాహితి లోక్ సభ ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె బుధవారం రోజున నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంకకు నామినేషన్‌ సమర్పించారు. ‘పొలిమేర’, ‘పొలిమేర 2’ సినిమాల్లో సాహితి తన నటనతో ఆకట్టుకున్నారు. మొదటిభాగంలో గెటప్‌ శ్రీను భార్య రాములు పాత్రలో నటించిన ఆమె సీక్వెల్‌లో రాజేశ్‌తో కలిసి నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version