మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..12మంది సజీవదహనం

-

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సును డంపర్ ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో 12 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

A terrible accident in AP Three youths died

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుణ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సును ఎదురుగా వస్తున్న డంపర్‌ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో మంటలు చెలరేగి 12 మంది సజీవదహనమయ్యారు. గుణ-ఆరోన్ రహదారిపై రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో నుంచి నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నామని జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ ఖత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news