World Cup 2023 : కన్నీటి పర్యంతమైన టీమిండియా…ఫోటోలు వైరల్

-

 

ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో సమిష్టిగా విఫలమైన టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే… మ్యాచ్ పూర్తయిన వెంటనే మహమ్మద్ సిరాజ్ కన్నీటి పర్యాంతం అయ్యాడు. రోహిత్ శర్మ సైతం తలదాచుకుంటూ నేరుగా డ్రెస్సింగ్ రూమ్ లోకి పరిగెత్తాడు. ఇతర ఆటగాళ్లు కూడా కెమెరాలకు తమ ముఖాలను చూపించలేకపోయారు. విరాట్ కోహ్లీ ఒక్కడే ఆసీస్ ఆటగాళ్లందరితో మాట్లాడుతూ…. బాధను వ్యక్తం చేస్తూ అందరూ వెళ్ళిన తర్వాత మైదానం వీడాడు. ఈ మ్యాచ్ లో టీమిండియాను దురదృష్టం కూడా వెంటాడింది. ఒత్తిడిని తట్టుకోలేకపోవడం…. కీలక ఆటగాళ్లు విఫలమవ్వడం టీమిండియా ఓటమికి కారణం అయ్యాయి.

Rohit Sharma and Mohammed Siraj tearful moments after India defeat to Australia
Rohit Sharma and Mohammed Siraj tearful moments after India defeat to Australia

ఇక అటు వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమిని జీర్ణించుకోలేక తిరుపతిలో ఓ అభిమాని మృతి చెందాడు. తిరుపతి మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ యాదవ్ టీమిండియా ఓటమి అనంతరం, రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు చూస్తూ చలించిపోయారు. ఆకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు వెంటనే అతడిని తిరుపతిలోని ఓ ఆసుపత్రికి తరలించగా…. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news