Rohit Sharma : ముంబై కాలుష్యంపై.. రోహిత్ శర్మ ఆందోళన

-

ముంబైలో కాలుష్యం పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలకు ఈ పరిస్థితి సరైనది కాదని పేర్కొన్నారు. ‘మన ముందు తరాలు ఎటువంటి భయం లేకుండా జీవించడం ముఖ్యం. నేను క్రికెటేతర విషయాలు ఎప్పుడు మాట్లాడిన ముందుగా ఈ అంశాన్నే ప్రస్తావిస్తాను. వాతావరణంపై మనం జాగ్రత్తలు తీసుకోవాలి’ అని రోహిత్ స్పష్టం చేశారు. ముంబైలో కాలుష్యంపై బాంబే హైకోర్టు సైతం ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది.

Rohit Sharma on mumbai pollution
Rohit Sharma on mumbai pollution

కాగా.. నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ లోనే చాలా స్పెషల్. హిట్ మ్యాన్ ఈ వాంఖడే స్టేడియంలో ఎక్కువగా మ్యాచ్లు ఆడుతూ పెరిగారు. దాదాపు 12 ఏళ్ల క్రితం 2011లో ఈ స్టేడియంలోనే భారత్, శ్రీలంక WC ఫైనల్ ఆడాయి. ఈ WCలో రోహిత్ కి చోటు దక్కలేదు. అప్పుడు రోహిత్ ఎంతో బాధపడ్డారు. ఇప్పుడు అదే శ్రీలంక పై గెలిచి సెమీస్ కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news