అయ్యప్ప భక్తులకు అలర్ట్..రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

-

అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమల ఆలయం రేపు తెరుచుకోనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలోని అయ్యప్ప ఆలయం రేపు (శనివారం) తెరుచుకోనుంది. మండల పూజా అనంతరం బుధవారం రాత్రి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

మకరవిళక్కు ఉత్సవాల్లో భాగంగా తిరిగి ఈ నెల 30న ఆలయ ద్వారాలను తెరిచి, భక్తులకు స్వామి దర్శనం కల్పించనున్నారు. జనవరి 13న శుద్ధక్రియ, 14న బింబశుద్ధక్రియలు నిర్వహించనున్నారు. 15న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. 20న ఆలయాన్ని మూసివేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news