దిల్లీ లిక్కర్ కేసు.. సీబీఐ కేసులోనూ అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి

-

దిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈడీ కేసులో గతంలో అప్రూవర్ గా మారారు. అయితే తాజాగా ఆయన సీబీఐ కేసులోనూ అప్రూవర్ గా మారారు. అప్రూవర్ గా మారిన అనంతరం ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని ప్రత్యేక కోర్టు జడ్జి నమోదు చేశారు.

ఈడీ కేసులో గతంలోనే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే. సీబీఐ, ఈడీ వేర్వేరుగా నమోదు చేసిన 2 కేసుల్లో అప్రూవర్ గా మారారు. మరోవైపు దిల్లీ మద్యం కేసులో గత నెలలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్టు చేసింది. కోర్టులో హాజరు పరిచాక శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు సీబీఐ కోర్టుకు వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news