Femina Miss India World 2022 : మిస్ ఇండియాగా కర్ణాటక అమ్మాయి..

-

ముంబైలో పుట్టి కర్ణాటకలో పెరిగిన సినీ శెట్టి మిస్ ఇండియా 2022 కిరీటం దక్కింది. 58వ ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీలో విజయాన్ని ఆవరించింది. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి చేతుల మీదుగా సినీ శెట్టి కిరీటం అందుకున్నారు. రాబోయే ఎడిషన్ లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ… మిస్ వరల్డ్ పోటీలో పాల్గొననున్నారు.

సినీ శెట్టి కర్ణాటకలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం సిఎఫ్ఏ అనే ప్రొఫెషనల్ కోర్స్ లో ఉన్నారు. ఇంకా ఆమె భరతనాట్యం డాన్సర్ కూడా కావడం విశేషం. ఇది ఇలా ఉండగా 21 సంవత్సరాల శనతా చౌహన్… సెకండ్ రన్నర్ అప్ గా నిలువగా… రుబాల్ షికావత్ ఫస్ట్ రన్నర్ గా ప్రకటించారు. ఫెమినా మిస్ ఇండియా నిర్వహించిన అందాల పోటీల గురించి అదే సంస్థ సోషల్ మీడియా ద్వారా విజేతలను ప్రకటిస్తూ తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news