BREAKING : ట్రక్కును ఢీకొన్న కారు.. మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనం

-

రాజస్థాన్‌లోని చురు-సాలాసర్ హైవేపై ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఒక ట్రక్కును వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది. ఈ క్రమంలో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. కారులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనమయ్యారు. సికార్‌లోని ఫతేపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కారుకు ఉత్తరప్రదేశ్ నంబర్ ప్లేట్ ఉందని తెలిపారు.

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి అగ్నిమాపక దళాలు చేరుకున్నాయని తెలిపారు. కారులో చెలరేగిన మంటలు అరగంటలో అదుపులోకి వచ్చాయని వెల్లడించారు. కారులో నుంచి ఆరు మృతదేహాలను వెలికితీశామని.. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. ట్రక్కులో చెలరేగిన మంటలను కూడా అదుపులోనికి తెస్తున్నామని, అందులో పత్తి (కాటన్) లోడ్ ఉందని ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version