BREAKING : జైలు నుంచి మరో లేఖ విడుదల చేసిన సుఖేష్ చంద్రశేఖర్

-

BREAKING : జైలు నుంచి మరో లేఖ విడుదల చేసారు సుఖేష్ చంద్రశేఖర్. గతంలో కల్వకుంట్ల కవితతో ఉన్న సంబంధాలపై లేఖలు విడుదల చేసిన సుఖేష్ చంద్రశేఖర్…ఇప్పుడు మరో లేఖ విడుదల చేయడం చర్చనీయాంశం అయింది. తన తరపు లాయర్ అనంత మాలిక్ ద్వారా తాజాగా లేఖ విడుదల చేశారు సుఖేష్ చంద్రశేఖర్.

అరవింద్ కేజ్రవాల్ పై మరోసారి ఆరోపణలు చేసిన సుఖేష్…హైదరాబాదులోని ఫార్మా కాంట్రాక్టర్ నుండి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కు ముడుపులు అందినట్లు ఆరోపణలు చేశారు. 2020 లో ఫార్మ కాంట్రాక్టర్ నుంచి అందిన ముడుపులతో అరవింద్ కేజ్రీవాల్ దుబాయ్ లో మూడు అపార్ట్మెంట్స్ ని కొనుగోలు చేశారని లేఖలో చెప్పాడు. వారం రోజుల క్రితం మూడు అపార్ట్మెంట్లను అత్యవసరంగా అమ్మకానికి పెట్టారు కేజ్రీవాల్ అంటూ వెల్లడించాడు సుఖేష్ చంద్రశేఖర్.

Read more RELATED
Recommended to you

Latest news