ఏ క్షణమైనా బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.. తెలంగాణలో 8 ఎంపీ స్థానాలకు ప్రకటన

-

పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి కూడా విజయకేతనం ఎగురవేసి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) నిర్వహించిన సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము నాలుగింటి వరకు ఈ కమిటీ చర్చలు జరిపింది.

ఈ నేపథ్యంలో ఇవాళ ఏ క్షణమైనా తొలి జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లిస్ట్‌లో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా 100 మంది పేర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. చాలామంది సిటింగ్‌ ఎంపీలకే మళ్లీ టికెట్లు దక్కనున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో యూపీ, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, కేరళ, తెలంగాణలోని స్థానాలపై దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాల సమాచారం. తెలంగాణలో తొలి విడతలో ఎనిమిది ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version