ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

-

ఒడిశాలో మరో ఘోర రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. ఒకే ట్రాక్​పైకి ఒక్కసారిగా మూడు రైళ్లు దూసుకొచ్చాయి. అయినా అదృష్టవశాత్తూ ఏ ప్రమాదం జరగలేదు. అయితే రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్ల ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల సిగ్నలింగ్ లోపం వల్ల రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే.

అసలేం జరిగిందంటే.. సుందర్‌గఢ్‌ జిల్లాలోని రవుర్కెలా రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం రోజున వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో సహా రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సంబల్‌పూర్‌-రవుర్కెలా మెము రైలు, రవుర్కెలా-ఝార్సుగూడ పాసింజర్‌ రైలు 100 మీటర్ల దూరంలో ఒకే లైన్లో ఎదురెదురుగా వచ్చాయి. మూడో రైలు పూరీ-రవుర్కెలా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇదే ట్రాక్‌పై ప్రయాణిస్తోంది.

అయితే గుర్తించిన మెము-పాసింజరు రైళ్ల సిబ్బంది వంద మీటర్ల దూరంలో రైళ్లను నిలపడంతో పెను ప్రమాదం తప్పింది. రవుర్కెలా రైల్వే స్టేషనుకు కేవలం 200 మీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపం వల్లే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. రైల్వే అధికారులు ఈ ఘటనపై స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news