నా కుమార్తె, అల్లుడిని నదిలో తోసేయండి.. మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

-

‘నమ్మక ద్రోహానికి పాల్పడిన నా కుమార్తె, అల్లుడిని నదిలో తోసేయండి’ అని  మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత ధర్మారావ్ బాబా ఆత్రామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అహేరి అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలతో ఆయన ఇలా స్పందించారు. అయితే మంత్రి కుమార్తె భాగశ్రీ, అల్లుడు రితురాజ్ హల్గేకర్.. శరద్ పవార్ వర్గం ఎన్సీపీలో చేరొచ్చన్న వార్తలపై మాట్లాడారు.

పార్టీలు వీడి కొందరూ వెళ్తుంటారు. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. నా రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని మా కుటుంబంలో కొందరూ మరో పార్టీలో చేరాలని అనుకుంటున్నారు. శరద్ పవార్ గ్రూపు నాయకులు నా ఇంటిని ముక్కలు చేసి, నాపై నా కుమార్తెను పోటీకి నిలబెట్టారని చూస్తున్నారు. నా కుమార్తె, అల్లుడిని నమ్మొద్దు. వారు నన్ను వదిలేశారు. వారిని ప్రాణహిత నదిలో తోసేయండి. ఓ తండ్రికి కుమార్తెగా ఉండలేకపోయిన అమ్మాయి.. మీ వ్యక్తి ఎలా అవుతుంది అని.. ఆ విషయం గురించి మీరు ఆలోచించాలి. ఆమె మీకు ఎలాంటి న్యాయం చేస్తుంది అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version