BREAKING : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్

-

ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్లిన ఓ కారు నేరుగా వెళ్లి ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడ దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని బ్రజ్ఘాట్ టోల్ ప్లాజా సమీపరంలో సోమవారం అర్ధరాత్రి కారు వెళ్లి ట్రక్కును ఢీ కొట్టింది. డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీ కొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మీరఠ్లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ఎవరో తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నామని పోలీస్ సూపరింటెండెంట్ అభిషేక్ వర్మ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news