ఉత్తరాఖండ్ లో లోయలో పడ్డ వాహనం..ఏకంగా 8 మంది !

-

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఉగాది పర్వదినాన వాహనం లోయలో పడింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లాలోని బేతాల్‌ఘాట్ ప్రాంతంలో సోమవారం రాత్రి వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు నేపాల్ పౌరులు మరణించారు.

Uttarakhand Eight Nepalese citizens killed in Nainital road accident

ఒకరు ఇండియాకు చెందిన వారు మరణించారని పోలీసులు తెలిపారు. వాహనం లోయలో పడటంతో ఎనిమిది మంది మృతి చెందటంతో పాటు, పలువురికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం నైనిటాల్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 60కి.మీ దూరంలో ఉందని పోలీసులు తెలిపారు. మృతులు అందరూ బేతాల్‌ఘాట్‌లోని ఉంచకోట్ గ్రామంలో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారని సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news