అకస్మాత్తుగా మంటలు.. వంతెనపై ఆగిన రైలు.. నదిలో దూకి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు

-

ఉత్తరాఖండ్​ రాష్ట్రంలోని హరిద్వార్​ జిల్లాలో రైలులో ఒక్కసారిగా పొగ వ్యాపించింది. ఆ తర్వాత నెమ్మదిగా మంటలు మొదలయ్యాయి. గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి రైలు నిలిపివేశారు. బయటకు వద్దామని డోర్ దగ్గరికి రాగా.. రైలు వంతెనపై ఆగిన విషయం చూసి షాకయ్యారు. వెంటనే ఆ వంతెనపై నెమ్మదిగా నడుచుకుంటూ కొందరు ప్రాణాలు నిలుపుకోగా.. మరికొందరు వంతెనపై నుంచి నదిలో దూకారు.

ఆదివారం రోజున లక్నో నుంచి చండీగఢ్ వెళ్తున్న సద్భావనా ​​ఎక్స్‌ప్రెస్ బ్రేక్​ల నుంచి పొగ వచ్చింది. రైల్లో మంటలు అంటుకున్నట్లు భావించిన ప్రయాణికులు చైన్​ లాగారు. రైలు లక్సర్ ప్రాంతంలోని రైసీ రైల్వే స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే బాణ్​గంగా నదిపై ఆగింది. ప్రయాణికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వంతెన అంచు నుంచి నడుచుకుని ముందుకు వెళ్లారు. కొంతమంది తమ ప్రాణాలను కాపాడుకోడానికి నదిలోకి దూకినట్లు అక్కడున్న కొందరు చెప్పారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బ్రేకులను పునరుద్ధరించారని.. అనంతరం రైలు బయలుదేరినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news