IND vs WI : చెలరేగిన నికోలస్‌ పూరన్‌.. రెండో టీ20లోనూ భారత్‌ ఓటమి!

-

వెస్టిండీస్ జట్టుపై టీమిండియా మరోపరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొదటి టి20 మ్యాచ్ లో గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్ లోను అదే తీరును కనబరిచింది. వెస్టిండీస్ చేతిలో ఏకంగా రెండు వికెట్ల తేడాతో టీమిండియా ఘోర ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.

అయితే ఈ లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు 18 ఓవర్లలోనే ఫినిష్ చేసింది. 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది వెస్టిండీస్ జట్టు. ఈ మ్యాచ్ లో అన్ని నికోలస్‌ పురాన్‌ 67 పరుగులతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌ లో తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ… హాఫ్‌ సెంచరీ చేసి రాణించాడు. కానీ టీమిండియా మాత్రం ఓడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news