IND VS WI : భారత్ ఓటమి.. సిరీస్ వెస్టిండీస్ సొంతం

-

టీమిండియా టి20 సిరీస్ ను కోల్పోయింది. నిన్న జరిగిన ఐదో టి20 మ్యాచ్ లో వెస్టిండీస్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది టీమిండియా. దీంతో ఈ టి 20 సిరీస్ ను వెస్టిండీస్ కైవసం చేసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీమిండియా జట్టు ఏకంగా 165 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలోనే చేదించేసింది.

ఇక టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే గత మ్యాచ్లో మెరిసిన గిల్ మరియు యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యారు. కేవలం సూర్య కుమార్ యాదవ్ మాత్రమే 61 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అటు తిలక్ వర్మ కూడా 27 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లందరూ విఫలం కావడంతో టీమిండియా తక్కువ టార్గెట్ ఇవ్వగలిగింది. ఇక లక్ష్యాన్ని సింపుల్గా చేదించి సిరీస్ ఎగురేసుకుపోయింది వెస్టిండీస్ జట్టు.

Read more RELATED
Recommended to you

Latest news