BREAKING: చిన్నారి లక్షితను చంపిన చిరుత చిక్కింది

-

తిరుమల శ్రీవారి దర్శనార్థం.. నడక మార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతల సంచారం భయభ్రాంతులకు గురి చేస్తోంది. జూన్ 11 న కౌశిక్ అనే బాలుడు చిరుత దాడిలో గాయపడి కోలుకోగా.. ఆగస్టు 11న లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో మరణించింది. అయితే తిరుమల నడకదారిలో రెండు రోజుల క్రితం చిన్నారి లక్షితను చంపిన చిరుత ఎట్టకేలకు చిక్కింది.

ఆ చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు పలుచోట్ల బోనులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే చివరకు నిన్న అర్ధరాత్రి ఒక బోనులో చిరుతను అధికారులు గుర్తించారు. రెండు రోజులుగా ఐదు ప్రాంతాలలో చిరుత సంచారానికి గుర్తించి బోనులు ఏర్పాటు చేయగా… ఎట్టకేలకు చిన్నారిపై దాడి చేసిన ప్రాంతానికి సమీపంలోనే ఆ చిరుత చిక్కింది. దీంతో అధికారులందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news