నవదీప్ లవ్ మౌళి ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?

-

అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా చేసిన సినిమా ‘లవ్ మౌళి’. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సీ స్పేస్ సంస్థ ఈ చిత్రంను నిర్మించింది. ఈ సినిమాలో పంఖురి గిద్వానీ హీరోయిన్ గా నటించగా.. భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న లవ్ మౌళి విడుదల కానుంది. తాజాగా లవ్ మౌళి ట్రైలర్ ని  చిత్ర యూనిట్ విడుదల చేసింది.

హీరో తాడు సాయంతో జలపాతం పైకి ఎక్కుతున్న సన్నివేశంతో లవ్ మౌళి ట్రైలర్ ప్రారంభమైంది. ‘పట్టపగలు కూడా వెలుతురు పడని ఈ గుహ లాంటి గుండె నాది’, ‘ఏం చేస్తున్నామో చూసి ప్రేమిస్తారు.. ఎంత సంపాదిస్తాన్నామో చూసి పెళ్లి చేసుకుంటారు.. దీంట్లో లవ్ ఎక్కడుంది’, ‘నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకు తెలియపోవడం ఏంటి?’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నాలుగు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్లో బోల్డ్ కంటెంట్ బోలెడుంది. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. ప్రేమ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో లవ్ మౌళి చిత్రాన్ని తెరకెక్కించారు. మనుషులతో ఎలాంటి పరిచయం లేని వ్యక్తికి.. ప్రేమించే వ్యక్తి దొరికితే ఎలా మారతాడు? అనే విషయాన్ని బోల్డనే చెప్పినట్లు ఉంది. 2021లో ప్రారంభమైన లవ్ మౌళి సినిమా.. కరోనా సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొని ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news