ఎన్డీఏ అంతా అతుకుల బొంత : సీఎం రేవంత్ రెడ్డి

-

మరికొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది అని చంద్ర బాబు నాయుడు వెల్లడించారు.

ఇక  ఏపీలో తెలుగుదేశం పార్టీ , బీజేపీ,జనసెన పొత్తులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రతి రాష్ట్రంలో మోదీ పొత్తులు పెట్టుకుంటున్నారు. ఏపీలో చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకున్నారు అని అన్నారు. 400 సీట్లు గెలిచేలా ఉంటే చంద్రబాబుతో పొత్తు ఎందుకు? అని ప్రశ్నించారు. ఎన్డీఏ అంతా అతుకుల బొంత’ అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవ చేశారు.కాగా,పొత్తులో భాగంగా జనసేన-బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్ సభ స్థానాలు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక టీడీపి 145 MLA స్థానాలు , 17 MP స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు టాక్.

Read more RELATED
Recommended to you

Latest news