పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎన్డీఏ సమావేశం

-

బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కొత్తగా ఎన్నికైన ఎంపీల సమావేశము శుక్రవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరగనుంది.ఈ సమావేశాలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపీలు పాల్గొంటారు. కూటమి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ 240 సీట్లకు పరిమితం అయిన నేపథ్యంలో భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జేడీయూ పార్టీల సహకారం తప్పనిసరి అయింది. అంతకుముందు బుధవారం ఎన్డీయేలోని పార్టీల నేతలు సమావేశమై ప్రధాని నరేంద్ర మోడీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.

అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణానికి ఎన్డీఏ కృషి చేస్తుందని అన్నారు. మోడీని ఎన్నుకునే తీర్మాన ప్రతిని సంకీర్ణ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేయనున్నారు.కాగా, జూన్ 9 వ తేదీన నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news