మోదీ, షా స్టాక్ మార్కెట్ల స్కాం..బీజేపీ ఎంపీ కౌంటర్

-

మోదీ, షా స్టాక్ మార్కెట్ల స్కాంకు పాల్పడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ పియూష్ గోయల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనే భయంతో స్టాక్ మార్కెట్ పడిపోయిందని అన్నారు. తిరిగి మోదీ ప్రభుత్వమే రావడంతో కుదురుకుంటోందని అన్నారు.మరోవైపు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలోని ప్రతి మహిళకు రూ. లక్ష ఇస్తామనే హామీని ఎప్పుడు నెరవేరుస్తారంటూ కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.

కాగా, ప్రధాని మోదీ, అమిత్ షా స్టాక్ మార్కెట్ల స్కాంకు పాల్పడ్డారని ,జేపీసీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ‘షేర్లు కొనాలని పిలుపునిచ్చి మోదీ, షా విధులను దుర్వినియోగం చేశారు. జూన్ 3న స్టాక్ మార్కెట్లు పెరుగుతాయని షాకు ఎలా తెలుసు. ఎగ్జిట్ పోల్స్తో ఆ రోజు పెరిగిన స్టాక్ మార్కెట్లు జూన్ 4న పతనమయ్యాయి. ఇందులోనూ వారి ప్రమేయముంది’ అని రాహుల్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news