2029లో కూడా ఎన్డీఏదే విజయం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా

-

2029 లోక్ సభ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత పదవీ కాలాన్ని సైతం విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. చండీఘడ్ లోని మణిమజ్రాలో ఓ నీటి సరఫరా చేసే ప్రాజెక్టును అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పక్షాలు ఏం చెప్పినప్పటికీ బీజేపీ నేతలు ఆందోళన చెందొద్దన్నారు.

ఎందుకంటే 2029లో కూడా ఎన్డీఏ నే అధికారంలోకి రాబోతుందని.. మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ అవుతారని తెలిపారు. ఈ విషయం పై తాను స్పష్టమైన హామీ ఇస్తున్నానని వెల్లడించారు. కొంత విజయంతో తాము ఎన్నికల్లో గెలిచామని ప్రతిపక్షాలు భావిస్తున్నారని.. కానీ మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వచ్చాయో.. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ దానికంటే ఎక్కువ సీట్లు సాధించిందని వారికి తెలియదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదని చెబుతున్న వారు దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version