ఒలింపిక్స్ : సెమీస్ లో లక్ష్య సేన్ ఓటమి..!

-

ఒలింపిక్స్ లో భారత జట్టుకు బ్యాట్మెంటన్ లో ఉన్న చివరి ఆశ లక్ష్య సేన్. పురుషుల సింగిల్స్ లో అద్భుత ప్రదర్శన చేస్తూ సెమీ ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన లక్ష్య సేన్ ఫైనల్ కు వెళ్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సెమీస్ లో వరల్డ్ నెంబర్ 2 టోక్యో ఒలంపిక్స్ ఛాంపియన్ తో లక్ష్య సేన్ కు మ్యాచ్ పడింది.

అయితే ఈ సెమీస్ లోని మొదటి సెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన లక్ష్య సేన్ చివరి వరకు ఆధిపత్యం కొనసాగించాడు. కానీ చివర్లో 20-22 తో సెట్ ఓడిపోయాడు. దాంతో రెండో సెట్ లో ఒత్తిడికి లోనైనా లక్ష్య సేన్ 14-21 తేడాతో ఓడిపోయి ఫైనల్స్ కు వెళ్లే అవకాశయాని మిస్ అయ్యాడు. కానీ మెడల్ రేస్ లో ఉన్నాడు. సెమీస్ లో ఓడటంతో లక్ష్య సేన్ ఇప్పుడు కాంస్య పతకం కోసం పోటీ పడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version