వెంకటగిరిలో తుస్సుమన్న యువగళం: నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

-

నారా లోకేష్ రాష్ట్రము అంతటా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తాజాగా నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో ప్రవేశించాడు. దీనిపై ఈ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ లోకేష్ చేస్తున్న యువగలానికి వెంకటగిరిలో స్పందన ఏమీ లేదన్నాడు. ఈ నియోజకవర్గంలో వారం రోజుల పాటు కాళ్లరిగేలా తిరిగినా ప్రజలు రాలేదని చెప్పారు. నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర చూస్తుంటే ఇది షికారుకు వచ్చిన యాత్రలా ఉందంటూ కామెంట్ చేశారు. ఈ మీటింగ్ లలో లోకేష్ చెప్పినవి అన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలేనని చెప్పారు రామ్ కుమార్ రెడ్డి. ఈ నియోజకవర్గంలో అక్రమాలు చేసిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ మరియు ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం లను పక్కన పెట్టుకున్న లోకేష్ కు అబద్దాలు తప్ప నిజాలు ఎలా వస్తాయి అంటూ ఆటాడుకున్నాడు.

టీడీపీ పాలనలో ఉన్న సమయంలో ఈ నియోజకవర్గానికి ఏమి చేశారో ఆలోచించుకుని తర్వాత పాదయాత్రలు చేయాలి అని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు రామ్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news