బింగో ప్యాకెట్ కోసం వచ్చి గోల్డ్ చైన్ మాయం…!

-

నెల్లూరు జిల్లాలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వరుస దొంగ తనాలతో ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతూ మహిళలను టెన్షన్ పెడుతున్నారు. తాజాగా బింగో ప్యాకెట్ కావాలని వచ్చి మహిళ మెడలో బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన గన్నవరం మండలం కేసరపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుడివాడ సత్యవతి స్థానిక హైస్కూలు ఎదుట దుకాణం నిర్వహిస్తున్నారు.

Nellore chain snatching case
Nellore chain snatching case

తొలుత పెట్రోల్ అనంతరం బింగో ప్యాకెట్ కావాలని నిందితుడు దుకాణానికి వచ్చాడు. బింగో ప్యాకెట్ ఇద్దామని లేచి వెళ్తుండగా మెడలో బంగారు గొలుసు లాక్కొని బైక్ పై పరార్ అయ్యాడు. లాక్కెళ్లిన గొలుసు సుమారు ఆరున్నర కాసులు(52 గ్రాములు) ఉంటుందని బాధితురాలు ఆరోపిస్తున్నారు. స్థానికంగా వరుస గొలుసు చోరీలతో స్థానికులు భయాందోళన నెలకొంది. దాంతో ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే మహిళలు భయపడిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news