బ్రేకింగ్ : భారీగా నమోదయిన కొత్త స్ట్రెయిన్ కేసులు

-

ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా స్ట్రైన్ కేసులు భారత్ ను కూడా టెన్షన్ పెడుతున్నాయి. ఏకంగా ఒక రోజులో 20 కొత్త కరోనా కేసులు  నమోదు కావడం సంచలనంగా మారింది.  ఈ కొత్త కరోనా కేసులకు సంబంధించి  కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ప్రకారం భారత్ లో కొత్త కరోనా కేసులు 58కి  చేరాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో 20 కొత్త కేసులను గుర్తించినట్లు సమాచారం. ఈ కొత్త కరోనా సోకిన అందరినీ వివిధ రాష్ట్రాల్లో నియమించబడిన హెల్త్‌కేర్ సెంటర్లలో ఐసోలేషన్లో ఉంచారు. వీరి కాంటాక్ట్ లనుకూడా ప్రస్తుతానికి ఐసోలేషన్లోనే ఉంచారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేసులు కూడా ఉండడంతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news