తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ గుడ్ న్యూస్…కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి తేదీ ఖరారు

-

ఈ నెల 26 నుంచే కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్‌. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3, 60 ,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజక వర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపినీ కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

జూలై 26 నుంచి ఈ నెల 31 వ తేదీ వరకు ఈ కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. కొత్త రేషన్‌ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్‌ బియ్యం అందజేయాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని సివిల్‌ సప్లయ్‌ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా చెప్పారు కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news