అన్ స్టాపబుల్ షో కు రాబోతున్నది వీరే..!!

-

నందమూరి బాలకృష్ణ అంటే మాస్ కా బాప్,  అభిమానులకు తనని మొన్నటి దాకా థియేటర్స్ లోనే చూసే అవకాశం వుండేది. కాని తాను ప్రస్తుతం టాక్ షో, యాడ్స్ లో కూడా కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఇక తన అభిమానులు కాని వారు కూడా అన్ స్టాపబుల్ షో  చూసి అందరూ జై బాలయ్య అంటూ గోల గోల చేస్తున్నారు. సీజన్ 1 ఓటిటి లలో రికార్డ్ మోత మోగించింది.

ఇప్పుడు సీజన్ 2 చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే జరిగిన ఎపిసోడ్స్ కుచంద్రబాబు, లోకేశ్ ,డి జే టిల్లు సిద్ధార్ద్, విశ్వక్ సేన్ అడివి శేష్, శర్వానంద్ , మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాధిక వచ్చి సందడి చేశారు. అయితే వచ్చే ఎపిసోడ్ కు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావును బాలయ్య తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడట.

అసలే మసాలా గ్లామర్ దర్శకుడు గా పేరు తెచ్చుకున్న రాఘవేంద్ర రావును బాలకృష్ణ ఖచ్చితంగా పూలు పండ్లు ప్రస్తావన తెచ్చి ఇరికించే ప్రయత్నం చేస్తాడు. ఇక అంతే కాకుండా ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ మరియు సురేష్ బాబు లు కూడా ఈ సీజన్ లో సందడి చేస్తారని తెలుస్తోంది. అంతే కాకుండా తెలుగు సినిమా దిగ్గజం విశ్వనాథ్‌ ను కూడా ఈ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.

 

Read more RELATED
Recommended to you

Latest news