దీక్షిత్ కిడ్నాప్ వ్యవహారంలో కొత్త అనుమానాలు..

-

తెలంగాణాలో సంచలనం రేపిన మహబూబాబాద్ దీక్షిత్ కిడ్నాప్ వ్యవహారంలో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదేంటంటే నిందితుడు మంద సాగర్ కు బాలుడి బాబాయ్ మనోజ్ రెడ్డికి మధ్య సంబంధాలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఈ వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. గతంలో పోలీస్ వాహనం నడిపే ప్రయివేటు డ్రైవర్ గా మంద సాగర్ పని చేసినట్టు వెలుగులోకి వచ్చింది.

ఇక తన లాంటి కడుపుకోత ఏ తల్లి కి రావద్దని బాలుడి తల్లి వసంత తల్లడిల్లిపోతోంది. ఈ మర్డర్ మిస్టరీలో సాగర్ తోపాటు ఎంతమంది ఉన్నా వారిని ఎన్ కౌంటర్ చేయాలి, లేదంటే బహిరంగంగా ఉరి తీస్తేనే ప్రతీ తల్లి తన బిడ్డలను నిర్బయంగా బయటకు పంపించగలుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక నిందితుదు సాగర్ అలానే బాలుడి తల్లిదండ్రులు ఇద్దరిదీ ఒకే గ్రామం పైగా పక్క పక్క ఇల్లే కావడం శనిగపురం గ్రామంలో పోలీసలను భారీగా మొహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news