తెలంగాణాలో మరో కిడ్నాప్ కలకలం.. అచ్చం సినిమాల్లో లానే !

-

తెలంగాణాలో ఓ బాలుడు కిడ్నాప్ అయి హత్యకు గురయిన సంగతి మరువక ముందే మరో కిడ్నాప్ కలకలం రేగింది. దత్తత ఇచ్చిన నాలుగు నెలల బాలుడిని తల్లిదండ్రులు తీసుకెళ్లేందుకు ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి అర్ధరాత్రి 8 మంది వచ్చి తిరుమల నాగేశ్వరి అనే ఆమె ఇంట్లోకి చొరబడి కళ్లలో కారం కొట్టి బాబుని తీసుకొని వాహనంలో పరారయ్యారు. అయితే ఈ క్రమంలో సూరవీడు గ్రామస్తులు వెంకటాపురం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యోగితా నగర్ గ్రామం వద్ద వాహనాన్ని పట్టుకుని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

నాలుగు నెలల క్రితం నాగేశ్వరీ బాలుడిని దత్తత తీసుకున్నట్టు చెబుతున్నారు. దత్తత ఇచ్చినవారే ఈపని చేసి ఉంటారని పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు చేసింది. ప్రేమ పెళ్లి చేసుకుని ఇంట్లో వారు కాదనడంతో 7నెలల గర్భిణిగా ఉండగా నాగేశ్వరిని స్నేహ-మహేందర్ దంపతులు ఆశ్రయించారు. దీంతో నాగేశ్వరీ కాన్పు చేసిన చేసింది. అయితే పుట్టిన బాలుడు మాకు వద్దని తల్లిదండ్రులు అనడంతో నాగేశ్వరి దత్తత తీసుకుని పెంచుకుంటోంది. అర్థరాత్రి నాగేశ్వరిపై దాడి చేసి, కళ్లలో కారం చల్లి మరీ బాలుడిని ఎత్తు కెళ్ళారు దుండగులు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news