హత్రాస్ కేసులో కొత్త ట్విస్ట్.. మా ఫ్రెండే, అందుకే చంపేశారు ?

-

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ దళిత యువతి హత్యాచారం కేసు అనేక కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు తమను తాము అమాయకులమని అంటున్నారు. అంతే కాదు ఆమెను చంపింది బాధితురాలి కుటుంబ సభ్యులే అంటూ వారి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ మేరకు హత్రాస్ జిల్లా ఎస్పీ వినీత్‌ జైశ్వాల్‌ కు ఆ నలుగురూ లేఖ రాశారు. సదరు యువతితో తమకు స్నేహం ఉండేదని, బాధితురాలితో తరచూ తాము మాట్లాడుతుండే వాళ్లమని నిందితులు తెలిపారు.

ఆ ఘటన జరిగిన రోజు తాను అక్కడే ఉన్నానని, బాధితురాలి తల్లి, సోదరుడు అక్కడికి వచ్చి అభ్యంతరం తెలపడంతో అక్కడి నుంచి వెళ్లి పోయినట్టు ప్రధాన నిందితుడు చెబుతున్నారు. తమ స్నేహం ఇష్టంలేక ఆమె కుటుంబమే ఆమెను హతమార్చిందని ఆ తరువాత మళ్ళీ తమపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిందని ఆరోపిస్తున్నారు. ఇక నిందితుల ఆరోపణలపై బాధితురాలి తండ్రి స్పందిస్తూ తమ కుమార్తెను కోల్పోయిన తమ మీదే నిందితులు తమపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news