విజయవాడలో డ్యాన్సర్ సూసైడ్ : సంచలన అంశాలు వెలుగులోకి !

-

విజయవాడ వాంబే కాలనీలో ఈవెంట్ డ్యాన్సర్  అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని డాన్సర్ గాయత్రి ఆత్మహత్యకు పాల్పడింది. గాయత్రి ఆత్మహత్యకు ముందు నీలిమా అనే యువతి ఇంటి కొచ్చింది. ఇద్దరి మధ్య ఇంట్లో వివాదం నెలకొంది.  నీలిమా వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో డాన్సర్  గాయత్రి చీరతో ఉరివేసుకుని చనిపోయింది. ఆ సమయంలో గాయత్రి భర్త సతీష్ పిల్లలతో కలిసి బయటకు వెళ్ళాడు. గాయత్రి మృతిపై  కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో అనుమానపు మృతిగా కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఆమె సూసైడ్ కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

గాయత్రి భర్తపై అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న గాయత్రి స్నేహితురాలు నీలిమ వెల్లడించింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్తకు ఆమెకు వివాహేతర సంబంధం ఉందని పేర్కొంది. 6 నెలల కిందటే నేను గాయత్రిని కలిసి నా భర్తకు దూరంగా ఉండాలని చెప్పానని గాయత్రి కూడా దానికి సరే అని చెప్పిందని పేర్కొంది. ఒక వేళ వదులుకోలేక పొతే నా భర్తతో కలిసి ఉండాలని నేను విడిగా ఉంటాను అని కూడా చెప్పానని దానికి గాయత్రి అంగీకరించలేదని ఇంతకు ముందులాగా స్నేహితులుగా ఉండాలని, ఇలాంటిది పునరావృతం అవదని చెప్పిందని పేర్కొంది. అయితే ఈ వివాహేతర సంబంధం గురించి తెలిసాక గాయత్రిని భర్త సంతోష్ తీవ్రంగా కొట్టాడని ఈ విషయం గాయత్రి నాకు ఫోన్ లో చెప్పిందని ఆమె పేర్కొంది. ఇక సూసైడ్ జరిగిన రోజు వెళ్లి కలిసిన మాట వాస్తవమే, నేను నార్మల్ గా కలిశానని ఎందుకు సూసైడ్ చేసుకుందో పోలీసుల విచారణలో తేల్చాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news