మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ఆలౌట్.. ఇండియాకు 49 పరుగుల ఆధిక్యం

-

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ వేదికగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మొదటి ఇన్నింగ్స్ లో 345 పరుగులకు టీమిండియా ఆలౌట్ కాగా… అటు న్యూజిలాండ్ జట్టు 296 పరుగులకు ఆలౌట్ అయింది.

న్యూజిలాండ్ బ్యాటింగ్ వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్ ఓపెనర్లు లేతమ్ 95 పరుగులు, విలేజ్ యంగ్ 89 పరుగులు, కెప్టెన్ విలియమ్సన్ 18 పరుగులు, జేమ్సన్ 23 పరుగులు చేసి ఇ న్యూజిలాండ్ జట్టును ఆదుకున్నారు. దీంతో న్యూజిలాండ్ జట్టు 143 ఓవర్లలో ఏకంగా 296 పరుగులు చేసి ఆలౌటైంది. అయితే.. న్యూజిలాండ్ జట్టు 296 పరుగులకే ఆలౌట్ కావడంతో.. ఇండియాకు 49 పరుగుల లీడ్ లభించింది. ఇక కాసేపటి క్రితమే టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది. అయితే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా కు ఆదిలోనే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఓపెనర్ సుబ్రమణి గిల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే వెనుదిరిగాడు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ అలాగే పూజారా క్రీజులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news